పండించిన ధాన్యం కొనుగోలు చేయాలి
– వీర్నపల్లి మండలం వన్పల్లి రైతులు
– ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా
– ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో
సిరిసిల్ల/కలెక్టరేట్(నేటి ధాత్రి):
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో దయనీయంగా తయారైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పెళ్లి గ్రామ రైతులు గురువారం కలెక్టరేట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని సుమారు 45 కిలోమీటర్ల ప్రయాణించి ఎర్రటి ఎండలో ధర్నా చేశారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝానీ కలిసి సమస్య పరిష్కరించేలా చూడాలని కలెక్టరేట్ వద్దకు రాగా పోలీసులు గేట్లు అమర్చి లోనికి వెళ్లకుండా రైతులను అడ్డుకున్నారు.
సుమారు గంటపాటు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన కలెక్టర్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో రైతులు కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రైతులు ఎర్రటి ఎండలో ప్రధాన రోడ్డుపై పిక్కలు కాలుతున్న బైఠాయించగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
పోలీసులు చేరుకొని వారిని సముదాయించి కలెక్టర్ వద్దకు ఐదుగురునీ తీసుకుని పోయేలా ఒప్పించి రాస్తారోకో విరవింప చేశారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద రైతులు మాట్లాడుతూ…
గత రెండు నెలల క్రితమే కోతలు పూర్తయ్యాయని వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మా కడుపు మండి పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు సమస్య పరిష్కరించాలని చేరుకున్నామన్నారు.
సందీప్ కుమార్ స్పందించాలని రైతులు 6 నెలలు కష్టపడి పండించిన పంట వెంటనే కొనుగోలు చేస్తే రైతు కుటుంబాలు బాగుపడతాయి అన్నారు.
పక్కనే ఉన్న నిజాంబాద్ జిల్లా సిరికొండ మండలంలో వరి ధాన్యం కొనుగోలు పూర్తి డబ్బులు కూడా రైతులకు అందించారన్నారు.
అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయని కేవలం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇలా ఎందుకు ఈ వివక్ష అని ప్రశ్నించారు.
ప్రభుత్వం రైతును రాజులు చేస్తామని వాగ్దానాలు చేయడమే కానీ రైతు నేడు బిచ్చగాడులా మారుతున్నాడని మండిపడ్డారు.
ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన ధాన్యం బార్దాన్లో ఆరబోస్తే బార్ధాన్లు చెదలు పట్టి చెడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు తమ పంటను పండించేందుకు మందు బస్తాలు కూలీల కోసం అప్పులు చేసి వ్యవసాయం చేస్తారని అన్నారు.
ఇప్పుడు కేవలం వీర్నపల్లి మండలం బొంపల్లి గ్రామస్తులు మాత్రమే ధర్నాకు వచ్చామని సమస్య పరిష్కరించకుండా ప్రతి గ్రామం నుండి గ్రామాలన్నీ కాళీ చేసి కలెక్టరేట్ వద్దకు చేరుకుంటామని రైతులు హెచ్చరించారు.
కార్యక్రమంలో సుమారు వందమంది వరకు గ్రామ రైతులు పాల్గొన్నారు.