`తెలంగాణ కోసం పద్నాలుగేళ్ల యుద్ధం కేసిఆర్.
`తెలంగాణ కోసం పుట్టిన ఉద్యమ ఖడ్గం కేసిఆర్.
`తెలంగాణ జాతి విముక్తి పోరాటం కేసిఆర్.
`ఉద్యమానికి కేసిఆర్ ఊపిరిపోసి ఇరవైఐదు వసంతాలు!
`కేసిఆర్ జై తెలంగాణ గొంతెత్తి జైకొట్టి ఇరవైఐదేళ్లు.
`పిల్లా, జెల్లాకు ఉగ్గు పాలతో నూరిపోసిన నినాదం జై తెలంగాణకు పచ్చీస్ సాల్.
`ఉడుకు నెత్తురు ఉప్పెనై పొంగిన ఆవేశం టిఆర్ఎస్.
`బక్క పలుచని కేసిఆర్ సింహ గర్జనకు పాతికేళ్లు.
`చెక్కు చెదరని తెలంగాణ ఆత్మ గౌరవ విశ్వాసానికి సిల్వర్ జూబ్లీ.
`తెలంగాణకు గులాబీ తిలకం దిద్ది ట్వెంటీ ఫైవ్ ఇయర్స్.
`రైతు నాగలి గుర్తుతో జై తెలంగాణ నినాదం గర్జించిన రోజులు.
`సరిగ్గా ఇరవై ఐదేళ్ల నాడు ఎటు చూసినా కరువే.
`ఎవరిని కదిలించినా దుఖమే.
`ఆగమైన బతుకునుండి కన్నీటి మంటలతో రగిలిన తెలంగాణ.
`తెలంగాణ తెచ్చుకోకపోతే పల్లెలు వల్లకాడులై పోతాయన్న భయం నుంచి పట్టిన బాట జై తెలంగాణ.
`పటపట మంటూ పండ్లు నూరుకుంటూ పరుగు పరుగున సాగిన ఉప్పెన తెలంగాణ.
`ఒక్కడుగా మొదలై కోట్ల మందికి గర్జన నేర్పిన నేత కేసిఆర్.
`‘‘పుబ్బ’’ లో పుట్టి ‘‘మగ’’ లో మాడిపోతుందన్న వారిని ఎదిరించి నిలిచిన పార్టీ టిఆర్ఎస్.
`తెలంగాణ సాధించే వరకు పద్నాలుగేళ్ల అవిశ్రాంత పోరాటం టిఆర్ఎస్.
`పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ ఆవిష్కృతం బిఆర్ఎస్.
`తెలంగాణ చీకట్లను పారదోలిన పార్టీ బిఆర్ఎస్.
`మోడువాడిన తెలంగాణను చిగురింపజేసిన పార్టీ బిఆర్ఎస్.
`ఎడారి లాంటి తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన పార్టీ బిఆర్ఎస్.
`అన్నమో రామచంద్రా అనే ఆకలి కేకల నుంచి దేశానికి అన్నం పెట్టిన పాలన బిఆర్ఎస్.
`తెలంగాణ రైతును రాజును చేసిన పార్టీ బిఆర్ఎస్.
`తెలంగాణ తెచ్చింది ‘‘టిఆర్ఎస్’’… బంగారు తెలంగాణ చేసింది ‘‘బిఆర్ఎస్’’.
తెలంగాణ ఉద్యమ సృష్టికి మూలమైన బిఆర్ఎస్ పార్టీ ఎవరూ ఊహించనటు వంటి ఉద్యమాలకు, పోరాటాలకే కాదు, సభలకు, సమావేశాలకు కూడా పెట్టింది పేరు. రాజకీయ పార్టీల చరిత్రలో బిఆర్ఎస్పార్టీ నిర్వహించినన్ని సభలో ఏ పార్టీ నిర్వహించి వుండకపోవచ్చు. పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్తానంలో కొన్ని వందల సభలు నిర్వహించిన ఘనత ఒక్క బి ఆర్ఎస్కే దక్కుతుంది. సభలల్లో చిన్న చిన్న సభలే కాదు, ఎవరి ఊహకందనటు భారీ భహిరంగ సభల నిర్వహణలో బిఆర్ఎస్దే పై చేయి. అలాంటి భారీ రాజకీయ, ఉద్యమ సభలు దేశంలో ఏ పార్టీ నిర్వహించలేదు. గతంలో హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో సభలు నిర్వహించి, వాటినే గొప్ప సభలుగా చెప్పుకున్న రోజులున్నాయి. ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహంచిన భారీ భహిరంగ సభలతో పరేడ్ గ్రౌండ్ సభలకు కాలం చెల్లినట్లైంది. తెలంగాణలో ఏ పార్టీ రాజకీయ సభ పెట్టినా, బిఆర్ఎస్ సభలతో పోల్చుకుంటూ, మీడియా అనేక చర్చా వేధికలు ఇప్పటీకీ ఏర్పాటు చేస్తుంటాయి. సభల్లో బిఆర్ఎస్ను బీట్ చేయడం ఎవరి వల్ల కాదని ఆఖరుకు తీర్పునిస్తుంటాయి. అంతగొప్పగా సభలు నిర్వహించడంలో బిఆర్ఎస్ నాయకుల వ్యూహం ముందు ఏ పార్టీ సభలైనా బలారూరే అని చెప్పాలి. ఉద్యమ సమయంలో బిఆర్ఎస్ సభ అంటే పుట్టలు పగలి చీమలు వచ్చినట్లు జనం తండోపతండాలుగా వచ్చేవారు. ఎండా, వాన, చలిలను లెక్క చేయకుండా ఉద్యమ సభలను ప్రజలు విజయవంతం చేస్తుండేవారు. కరీంనగర్లో నిర్వహించిన సింహ గర్జనతో మొందలైన పెద్ద పెద్ద పెద్ద సభలు అప్పట్లో జిల్లాకొకటి జరగుతూ వుండేది. అప్పట్లో వరంగల్లో జరిగిన బిఆర్ఎస్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకున్నదంటే ఆశామాషీ కాదు. వరంగల్ సభకు పదిహేను లక్షలమంది హజరైనట్లు లెక్కలున్నాయి. ఆ తర్వాత కూడా అనేక సభలు నిర్వహించి, ప్రజల్లో తెలంగాణ ఉద్యమాన్ని సజీవం చేసిన ఘనత కేసిఆర్కే దక్కుతుంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత గాని, అదికారంలో వున్న పదేళ్లలో గాని మళ్లీ అంత పెద్ద సభలు బిఆర్ఎస్ల నిర్వహణలు ఆపలేదు. 2014 ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల సభలు పెద్దఎత్తున నిర్వహించారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసిఆర్ చేసిన బస్సుయాత్రకు కూడా ప్రజలు తండోపతండాలుగా కదలి వచ్చారు. అంతకు ముందు నిర్వహించిన నల్గొండ సభకు కూడా ప్రజలు లక్షల సంఖ్యలో హాజరయ్యారు. బిఆర్ఎస్ పార్టీ పుట్టి 25 సంవత్సరాలు పూర్తి కావొస్తోంది. ఆ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేసింది. అందులో భాగంగా తెలంగాణ ప్రజల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రజాభిమానం చెక్కు చెదరలేదని నిరూపించేందుకు వరంగల్లో మరో భారీ భహిరంగ సభ నిర్వహించేందు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే గతంలో బిఆర్ఎస్సభలకు, ఈ నెల 27న వరంగల్లో జరిగే సభకు కొంత వ్యత్యాసముంది. గతంలో ఉద్యమ కోణంతోపాటు,రాజకీయ ఎన్నికల సభలు జరుగుతూ వుండేవి. కాని ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ పుట్టి ఇప్పటికీ 25 ఏళ్లు పూర్తి కావస్తుండడంతో ఈ సభ కూడా చరిత్రలో నిలిచేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో బిఆర్ఎస్కున్న రికార్డును బ్రేక్ చేయాలని చూస్తున్నారు. వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తి సమీపంలో సుమారు 1200 ఎకరాలలో బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీసభ నిర్వహణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 15 లక్షల మందిని సమీకరించే పనిలో బిఆర్ఎస్ శ్రేణులున్నాయి. తెలంగాణలో అధికారంకోల్పోయినా సరే, బిఆర్ఎస్పై ప్రజలకు ఏ మాత్రం అభిమానం తగ్గలేదని నిరూపించాలంటే ఉద్యమ సమయంలో జరిగిన సభలను మించి నిర్వహించాలని చూస్తున్నారు. అందుకోసం బిఆర్ఎస్ అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ఎప్పటికప్పుడు నాయకులతో చర్చలు జరుపుతున్నారు. సభ ఏర్పాట్లును ఎప్పటికికప్పుడు సమీక్షిస్తున్నారు. పనులు వేగం పెంచేందుకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ సభతో బిఆర్ఎస్ మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టేలా వుండనున్నది. బిఆర్ఎస్కు తెలంగాణలో ఎదురులేదని, తిరుగులేదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాడిన్న కాలంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా వుంటున్న కేసిఆర్ మొదటి సారి తన గళాన్ని వినిపించే వేదిక కావడంతో తెలంగాణ అంతా ఆ సభలో వుండేలా చూసుకుంటున్నారు. అందుకే 1200 ఎకరాల స్థలంలో సభ నిర్వహణను ఏర్పాటు చేస్తున్నారు.
బిఆర్ఎస్ అంటే రాజకీయాల కోసం పుట్టిన పార్టీ కాదు. ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ. కేసిఆర్ ఆలోచనతో మొగ్గ తొడిగిన పార్టీ. ప్రజల ఆవేదనల నుంచి పురుడు పోసుకున్న పార్టీ. ప్రజల ఆక్రందనల నుంచి మొలకెత్తిన పార్టీ. తెలంగాణ గోసలు తీర్చేందుకు ఏర్పాటైన పార్టీ. తెలంగాణ సాధన కోసం జ్వనించిన పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ధ్యేయంగా జ్వలించిన పార్టీ. ఉద్యమమై ఉరకలెత్తిన పార్టీ. పోరు దారిలో తెలంగాణ నినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేలా వినిపించిన పార్టీ. తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరులూదిన పార్టీ. తెలంగాణ అనే నినాదాన్ని ఆకాశాన్ని తాకేలా గర్జించిన పార్టీ. తెలంగాణ అనాలంటే ముందు,వెనుక ఒకటికిపదిసార్లు ఆలోచించేవారు కూడా పిడికిలి బిగించి జై తెలంగాణ అని ఎలిగెత్తేలా చేసిన పార్టీ. గొంతు సవరించుకొని అప్పటి పాలకుల గుండెలు అదిరేలా జై తెలంగాణ అని నినదించిన పార్టీ. సమైక్య పాలకులు గుండెలు అదిరేలా జై తెలంగాణ జపం చేసిన పార్టీ. తెలంగాణను అడ్డుకున్న వారి వెన్నులో వణుకుపుట్టించిన పార్టీ. తెలంగాణ వ్యతిరేకులను, సమైక్య వాదులకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన పార్టీ. ఇక తెలంగాణ మనది కాదని సమైక్య వాదులు మూట ముల్లె సర్ధుకొని వెళ్లిపోయేలా చేసిన పార్టీ. ఇక ఎంత అడ్డుకున్నా తెలంగాణ ఆగేది లేదని, కాదని తెలుసుకొని సమైక్య వాదులచేత కూడా జై తెలంగాణ అని పించిన పార్టీ. తెలంగాణ నుంచి ఆకలి కేకలతో, బతుకెళ్లదీసుకునేందుకు వలసలు పోయిన ప్రజలు మళ్లీ ఆత్మగౌరవంతో బతికేలా చేసిన పార్టీ. వారి ఆకలి తీర్చి, అన్నం పెట్టిన పార్టీ. ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసిన పార్టీ. తెలంగాణలో నీటి పరవళ్లు నింపిన పార్టీ. ఎప్పుడో దశాబ్దాల తరబడి ఎండిపోయిన వాగుల్లో , వంకల్లో, ఒర్రెల్లో కూడా నీరు పారించిన పార్టీ. ఎప్పుడో ఎండిపోయి, తుమ్మలు మొలిచి ఆనవాలు లేకుండాపోయిన చెరువులను బాగు చేసి, ఊరుకు కల్పతరువు చేసిన పార్టీ. ఊరుకు చెరువే ఆదరవని నిరూపించిన పార్టీ. పదేళ్ల పాటు చెరులన్నీ గంగాళలంలా కళకళలాడేలా చేసిన పార్టీ. ఎండా కాలంలో కూడా చెరువులు మత్తళ్లు దుంకేలా చేసిన పార్టీ. పాడి పండలతో తెలంగాణ సిరి సంపదలతో తులతూగేలా చేసిన పార్టీ. ఇదంతా ఒక్క కేసిఆర్ సృష్టి. తెలంగాణ సాధనలో కేసిఆర్ కలలుగన్న ఆర్తి. తన కలలను తానే నిజం చేసి, తెలంగాణకు సిరుల తెలంగాణ చేసిన కీర్తీ కేసిఆర్. తెలంగాణను బంగారు తెలంగాణ చేసి సుసంపన్నం చేసిన ఘణకీర్తి కేసిఆర్. పద్నాలుగేళ్లపాటు అలుపెరగని పోరాటం చేసి, లక్ష్యం ముద్దాడిన పార్టీ. తెలంగాణ తెచ్చిన చరిత్రకు కీర్తి కిరీటం కేసిఆర్. తెచ్చిన తెలంగాణలో బంగారు సిరి రాసులను పండిరచేలా ప్రాజెక్టులను నిర్మాణం చేసిన అపర భగీరధుడు కేసిఆర్. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు తెలంగాణ రాకపోతే కలలో కూడా ఊహించలేం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్ లాంటి నాయకుడు లేకపోతే తెలంగాణలో జలసిరులు చూడలేకపోయేవాళ్లం. అందుకే కేసిఆర్ అనే మూడక్షరాల పదమే తెలంగాణకు జీవం. తెలంగాణ ప్రగతి వేదం. ఆయన చూపే ప్రజలకు వరం. ఆయన నవ్వే బంగారం. తెలంగాణ కోసం ఆయన జీవితమే ఒక త్యాగం. ఆ త్యాగ ఫలాలే మనం అనుభవిస్తున్న జీవితాలు అర్ధం…పరమార్ధం. పదేళ్లతో తెలంగాణ తల రాత మార్చిన ముక్కంటి శివునికి ప్రతిరూపం. తెలంగాణ భవిష్యత్తును తీర్చి బ్రహ్మరాతకు కేసిఆర్ జలయజ్ఞం నిదర్శనం. తెలంగాణను అన్ని రంగాలలో పదేళ్లల పరుగులు పెట్టించిన ఆధునిక ఆర్దిక వేత్త కేసిఆర్. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందేలా చేసిన వైతాళికుడు కేసిఆర్. తెలంగాణ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే జాతి పిత కేసిఆర్.