బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయం
ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి
మండలంలోని,వర్షకొండ గ్రామంలో
కోలిచినవారికి కొంగు బంగారంగా నిలుస్తున్న స్వామివారు 150 సంవత్సరాల క్రిందటి పురాతన ఆలయం గా సంతానం లేని వారికి ఏడు శనివారాలు గిరి ప్రదక్షణ చేసిన వారికి సంతానం ప్రసాదించే పరమాత్మునిగా భక్తులు నమ్మకం పురాతనైనటువంటి కాలం నాటి ఆలయాలలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆలయం రాతితో గుండుతో ఏర్పాటు చేయబడి ఆలయ గర్భాలయం శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామివారి మూలవిరాట్ స్వామివారి కుడి భాగాన గోదాదేవి అమ్మవారి రెండుమిటర్ల, స్వామివారి రాతి విగ్రహాలు పురాతన ఆలయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆలయం ప్రతి సవత్సరం ఉగాది రోజున ఘనంగా జాతర నిర్వహిస్తారు గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ ప్రజల సహాయ సహకారాలతో జరుగుతాయి. కొన్ని సంవత్సరాలుగా మధుర అన్వేష్ చార్యుల మరియు మధుర రాము చార్యుల మరియు లక్ష్మణ్ చార్యులు లచేతుల మిదుగా ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుడు మరియు గరుత్మంతుడు. భక్తుల సహకారంతో నిర్మించారు మరియు భక్తుల సౌకర్యం కోసం సల్కం నాడ్పి రాములు ట్యాంకు ఏర్పాటు చేశారు మరియు మామిడి వంశస్థులు రథం చేపించి భగవంతునికి సమర్పించారు బ్రహ్మోత్సవాలకు వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో త్రాగునీరు అందజేస్తారు ఉత్సవాలను గ్రామాభివృద ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.