పేపర్ బ్యాగుల తయారీ రెండు రోజుల శిక్షణా కార్యక్రమం.

Paper bag Paper bag

ప్రభుత్వ పాఠశాలలో పేపర్ బ్యాగుల తయారీ రెండు రోజుల శిక్షణా కార్యక్రమం

చందుర్తి, నేటిధాత్రి:

 

పర్యావరణ పరిరక్షణ…ప్లాస్టిక్ వినియోగం నివారణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలంలోని జోగాపూర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వ్యర్థ పేపర్లను వినియోగించి పేపర్ బ్యాగులు, పేపర్ ఫైల్ తయారుచేయడంలో విద్యార్థులకు ఉపాధ్యయుడు మేడికాల అంజయ్య రెండు రోజులు శిక్షణనిచ్చాడు. విద్యార్థులు పలు రకాల బ్యాగులు, వివిధ రకాల పత్రాలు బధ్రపరచుకోవడానికి పేపర్ ఫైల్లను తయారు చేసి ప్రదర్శించారు. తమ గ్రామంలో ప్లాస్టిక్ బదులుగా పేపర్ బ్యాగ్ లు , పేపర్ ఫైల్ వాడతామని చెప్పా రు. శిక్షణను అందించిన ఉపాద్యాయుడు అంజయ్య మాట్లాడుతూ త్వరగా మట్టిలో కలిసిపోయో పేపర్ బ్యాగ్ లు పర్యవరణానికి ఎంతో మేలు చేస్తాయని వీటి తయారికి ఎలాంటి ఖర్చు ఉండదు కావున విద్యార్థులకు అవగాహన కల్పిస్తే భావితరాలకు కలుష్య రహిత సమాజాన్ని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించవచ్చన్నారు. ప్లాస్టిక్ వలన మన దేశంలో ప్రతి యోట లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, ప్లాస్టిక్ వాడకం తగ్గించి, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా త్వరగా మట్టిలో కలిసి పోయో పేపర్ బ్యాగ్ లు,జూట్ , బట్ట సంచులను విరివిగా వాడాలని ఉపాధ్యాయుడు అంజయ్య పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా శిక్షణనను అందించిన ఉపాద్యాయుడు అంజయ్యను ప్రధానోపాద్యాయులతో పాటు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు శ్రీధర్ రాజు, ఉపాధ్యాయులు జావీద్, మహేశ్, శ్రీనివాస్ , పద్మ, నర్సయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!