మీడియా మిత్రులకు శ్రీవారి భక్తుల అభివందనాలు.

Tirupati Tirupati

మీడియా మిత్రులకు శ్రీవారి భక్తుల అభివందనాలు

సీఎం నోట శుభవార్త విన్నాము

తిరుపతిని మధ్య రహిత క్షేత్రంగా సాధిద్దాం

తిరుపతి(నేటి ధాత్రి)మార్చి 24:

శ్రీనివాస సదానంద స్వామి స్వాముల ఆధ్వర్యంలో చేపట్టిన తిరుమల పవిత్రతను కాపాడుకుందాం శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ ను నిలిపివేయాలని నిరసనలు నిరాహార దీక్షలు పాదయాత్రలో చేపట్టిన కార్యక్రమాలను మీడియా మిత్రులు ప్రత్యేకంగా పలుమార్లు ప్రచురించి నందుకు మీడియా మిత్రులకు స్వామివారి భక్తులైన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో బీసీ నాయకులు శ్రీవారు భక్తుల జగన్నాథం మరియు అభయ హస్త గోవింద సేవ మండలి అధ్యక్షులు చంద్రమౌళి లు అన్నారు,సీఎం తిరుమలకు వస్తున్నారు. సీఎం నోటి శుభవార్త విందురని టిటిడి పాలకమండలి చైర్మన్ స్వాములకు ఫోన్ చేసి స్వయంగా తెలిపారని హిందూ పరిషత్ ఓంకార్ తెలిపారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల ప్రక్షాళన ముంతాజ్ హోటల్ తోనే మొదలెట్టారని ముఖ్యమంత్రి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు,
అలాగే సైనికులకు హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నీ మధ్య రహిత క్షేత్రంగా కలిసి పోరాడుదాం అని పలు పుణ్యక్షేత్రాలలో మధ్యరహిత పుణ్యక్షేత్రాలు గా ఎలాగైతే చేశారో అలాగే తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కూడా మధ్యాహ్నం క్షేత్రంగా చేసేంతవరకు హిందువులందరు కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అభయాస్త గోవింద మండలి సేవా సభ్యులు సురేష్ , రోహిత్ బాబు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!