మొగిలి దుర్గాప్రసాద్ కు సన్మానం.!

BJP leaders BJP leaders

మొగిలి దుర్గాప్రసాద్ కు సన్మానం

కల్వకుర్తి/ నేటి ధాత్రి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన భాజపా సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ మొగిలి దుర్గాప్రసాద్ రెండవసారి బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నియమించిన సందర్భంగా.. కల్వకుర్తి బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. 35 ఏళ్లుగా పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నందుకు పార్టీ గుర్తించి రెండవసారి రాష్ట్ర కౌన్సిల్ లాంటి కీలక పదవి కట్టబెట్టిందన్నారు.
ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు గుర్రాల రాంభూపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నీరుకంటి రవీందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య కృష్ణ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ నెంబర్ బృంగి వివేకానంద, కల్వకుర్తి మున్సిపాలిటీ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్,
నాయకులు శేఖర్ రెడ్డి, లక్ష్మీనరసింహ, అరవింద్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!