జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిఎ రమణ రావు పై అక్రమ ఇసుక దందాపై వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేస్తూ అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఏసిపి వెంకటేశ్వర్లు.వివరాల్లోకి వెళ్తే ఎల్కంటి గ్రామానికి చెందిన బేతి తిరుపతిరెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే పిఏ రమణ రావు ని లక్ష్యంగా చేసుకొని అపరాధమైన నిరూపణ చేసి తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాడని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు తిరుపతి రెడ్డి పై ఐటి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని ఏసిపి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా త్వరలో పట్టుకొని అరెస్టు చేస్తామని తెలిపారు.