నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో సరస్వతి మాత విగ్రహావిష్కరణ జరిగింది. వాసవి క్లబ్ హనుమకొండ మరియు వాసవి క్లబ్ వనిత హనుమకొండ గ్రేటర్ వారి ఆధ్వర్యంలో చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో కే సి జి ఎఫ్ జిల్లా గవర్నర్ గంప సాంబమూర్తి సరస్వతి మాత విగ్రహవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ మెంబర్స్ విడియాల నూతన్ కుమార్,పబ్బతి నాగభూషణం,పాలడుగుల లక్ష్మణ్ కాంత్,అయిత వెంకటేశ్వర్లు,ఇరుకుల్ల శ్రీనివాస్,మాదం శెట్టి సంపత్ పాఠశాల, ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్,చర్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి,అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ, నందిపాటి సంధ్య,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.