నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
రోడ్డు ప్రమాదాలకు అడ్డుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్,కంప చెట్లను తొలగించాలనిసిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. సోమవారంనేర్మట గ్రామంలో ఏర్పాటు చేసినసమావేశంలో ఆయన మాట్లాడుతూ,నేర్మట, ధోని పాముల రోడ్డు వెంటకంప చెట్లు, పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగాయనిఆయన అన్నారు.
ఈ సమస్యపై గతంలో ఎన్నోసార్లు అధికారులకు చెప్పినప్పటికీ గతంలో ఒకసారి కంపచెట్లను తొలగించారని, మళ్లీ వానలు పడటంతోవిపరీతంగా పెరిగాయనివెంటనే అధికారులు స్పందించితక్షణమే చర్యలు తీసుకోవాలనిఆయన అన్నారు.ఈ రోడ్డు పక్కన ట్రాన్స్ ఫార్మర్ ఉండడంతో ప్రమాదాలు జరగడానికి అవకాశముందనిఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు వెంటట్రాన్స్ఫార్మర్, కంప చెట్లు వెంటనే తొలగించాలనిఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోడ్డు వెంటకంప చెట్లను, ట్రాన్స్ ఫార్మర్ తొలగించకపోవడంతో పలు ప్రమాదాలకు కారణం అవుతున్నాయనిఆయన అన్నారు.ఈ రోడ్డు మార్గాన్ని ఇరువైపుల వైశాల్యం పెంచి రోడ్డు విస్తరణ చర్యలు చేపట్టాలని, ప్రమాదాలు నివారించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులుఈరటి వెంకటయ్య, బల్లెం స్వామి, యాదయ్య,గుయ్యని పండుతదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలకు అడ్డుగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్, కంప చెట్లను తొలగించాలి: సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
