వనపర్తి లో మిగిలి పోయిన రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి

వనపర్తి నేటిధాత్రి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి మున్సిపల్ కౌన్సిల్ సంతానం తెలిపారు వనపర్తి జిల్లా కేంద్రంలో మున్సిపల్ సాధారణ సమావేశం అధికారులు చైర్మన్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సుస్కంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ మున్సిపల్ కౌన్సిలర్లు బండారు కృష్ణ సత్యం పెండం నాగన్న యాదవ్ బ్రహ్మం కో ఆప్షన్ సభ్యులు గులాం ఖాదర్ ఖాన్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర రెడ్డి అధికారులు పాల్గొన్నారు గాంధీ విగ్రహం అంబేద్కర్ విగ్రహం గత ప్రభుత్వంలో రోడ్ల విస్తరణలో భాగంగా విగ్రహాలను తీసి చౌరస్తాల కాకుండా కొద్ది దూరంలో ఏర్పాటు చేశారు మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ గాంధీ విగ్రహం అంబేద్కర్ విగ్రహం పాత స్థలములనే ఏర్పాటు చేయిస్తామని తెలపడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్ తో వాదానికి దిగారు .వనపర్తి పట్టణంలో కర్నూల్ రోడ్ కొత్తకోట రోడ్ పానగల్ రోడ్డులో ఇంతవరకు రోడ్ల విస్తరణ చేయక పోవడపై మండిపడ్డారు . పానగల్ రోడ్డులో విస్తరణ బాధితులకు బీ ఆర్ ఎస్ ప్రభుత్వం లో డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించారని అయినా రోడ్ల విస్తరణ చేయకపోవడం విడ్డూరమని 15 అవార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ పెండెం నాగన్న యాదవ్ సభలో నిలదీశారు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సూచికంగా సమావేశం ఫస్ట్ లోనే సంతాపాము తెలుపకుండా సమావేశం వాయిదా వేయాలని మున్సిపల్ అధికారులకు పాలకులకు తెలియకపోవడంపై దివంగత దేశ ప్రధానిని మన్మోహన్ సింగ్ అవమానపరిచినట్లు అవుతుందని బండారు కృష్ణ నాగన్న యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!