నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

ఎమ్మెల్యే పాయం ఘన స్వాగతం పలికిన తాటిగూడెం గ్రామ ప్రజలు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామంలో 20 లక్షల అంచనాతో నూతనంగా నిర్మించిన తాటిగూడెం గ్రామపంచాయితీ కార్యాలయాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం గ్రామపంచాయితీ కార్యాలయానికి స్థలాన్ని డొనేట్ చేసిన కొమరం వెంకటమ్మ, కొమరం సత్యవతి, కొమరం విజయ శాలువాతో సన్మానించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు విద్య,వైద్యం, రెవెన్యూ,ఇరిగేషన్, ఎలక్ట్రికల్, ఫారెస్ట్, వ్యవసాయ శాఖ, అంగన్వాడి ఇలా అనేక ప్రభుత్వ శాఖ అధికారులతో గ్రామస్తుల సమక్షంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి పలు సమస్యలపై చర్చించి గ్రామస్తుల సమక్షంలోనే వాటిని పరిష్కరించారు ఈ సందర్భంగా పాయం మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిందని గ్రామంలో మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తుందని తెలియజేశారు నన్ను ఎన్నికలలో ఆశీర్వదించి గెలిపించిన నా ప్రజలకు
ఎటువంటి సమస్య రాకుండా కృషి చేస్తానని తెలియజేశారు ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు
ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు,కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్ , తాజా మాజీ ఎంపీటీసీలు,సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!