తంగళ్ళపల్లి నేటి దాత్రి
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల చిన్న లింగపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షలు జలగం ప్రవీణ్ పార్టీ నాయకులఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అభాగ్యులకు అండగా ప్రత్యేకంగా భరోసాగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలుస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తుందని తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా తీరుస్తుందని కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే తప్పకుండా నెరవేరుస్తుందని అలాగే రైతుల పక్షాన కాంగ్రెస్ ఎప్పుడు అండగా ఉంటుందని మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అర్హులైన రైతులందరికీ రుణమాఫీ రైతుబంధు వర్తిస్తుందని ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చాలామంది పేదలకు ప్రజలకు న్యాయమైన వైద్యం అందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలలు అయిందని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో దశలవారీగా తీర్చుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ 9 సంవత్సరాల ఆరు నెలలు పరిపాలన చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలనలో రాచరికపు నియంతృత్వ సాగించిందని బి ఆర్ ఎస్ పార్టీ వాగ్దానాలు కాగితాలకే పరిమితం అని వేలకోట్లు అప్పుచేసి ఖజానాను కొల్లగొట్టారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో వ్యవసాయమార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్ డైరెక్టర్లు గ్రామ శాఖ అధ్యక్షులు మండల కమిటీ నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు