రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రైవర్స్ గా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి శిక్షణ,అవగాహన కార్యక్రమం

బెల్లంపల్లి నేటిధాత్రి :

చిన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్ కుటుంబ భవిష్యత్తు ను రోడ్డు పాలు చేస్తుంది.అతి వేగం ప్రమాదానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ డ్రైవింగ్ చేయాలి పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.
ఈరోజు రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో, అధికారుల వద్ద డ్రైవింగ్ విధులు, జనరల్ డ్యూటీ, బీడీ టీమ్, పిఎస్ఓ విధులు నిర్వహిస్తున్న 200 మంది సిబ్బందికి బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో డ్రైవర్స్ కి శిక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమం కి రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్ ఐజి ముఖ్య అతిథిగా వచ్చి డ్రైవర్స్ కి పలు సూచనలు, సలహాలు, జాగ్రత్తలు తెలపడం జరిగింది. డ్రైవర్స్ కి ప్రశంస పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.ఆరోగ్యం పై వ్యక్తిగత శ్రద వహించాలి వాకింగ్, యోగ వంటివి చేయాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు సమయం దొరికినప్పుడు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, పిల్లలను బాగా చదివించాలని చాలా మంది పోలీస్ అధికారుల, సిబ్బంది పిల్లలు ఉన్నత స్థాయిలో అధికారులాగా ఉన్నారు మీ పిల్లలను కూడా బాగా చదివించి ఉన్నత స్థాయిలో ఉండేలా దిశనిర్దేశం చేయాలన్నారు.
డ్రైవర్ లు విశ్రాంతి సమయంలో విశ్రాంతి తీసుకోకుండా అనవసరంగా సమయం వృధా చేసుకొని వాహనం నడుపు సమయం లో ఇబ్బందిగా వాహనం నడపకూడదు.డ్రైవర్స్ వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లకు ఆదేశించినారు. పోలీసు అధికారుల ఆధీనంలో ఉన్న వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సొంత వాహనంలా మంచి కండిషన్లో ఉంచి ఎప్పటికప్పుడు సర్వీసింగ్, ఇంజన్ ఆయిల్, టైర్ల నిర్వహణ చూడాలన్నారు. ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుంది అన్నారు. కాబట్టి ఒక చిన్న నిర్లక్ష్యపు కారణం వలన ప్రమాదం సంభవించి వారి కుటుంబ భవిష్యత్తు రోడ్డు పాలవడం జరుగుతుందన్నారు.వాహనంలో కూర్చొని ప్రయాణించునపుడు అలర్టుగా వుండి, పరిసరలు నిశితముగా గమనిస్తూ ముందుకు వెళ్ళవలెను.ఏలాంటి ఆనందమైన విషయం ఐనా, సంతోకరమైన విషయం ఐనా, బాధ కరమైన లేదా ఎలాంటి సమస్య ఉన్న వాహనం ఎక్కేవరకే ఉంచాలి. ఒక్కసారి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాక పూర్తి స్థాయిలో ద్రుష్టి డ్రైవింగ్ పైనే ఉండాలి లేకపోతే ఏదో ఆలోచనలో ఉండి వాహనం ప్రమాదానికి గురై అవకాశం ఎక్కువ వాహనం నడిపేసమయంలో సెల్ ఫోన్ లో మాట్లాడటం, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించటం చేయరాదు. వాహనం ని ఇష్టనుసారంగా ఆపి, నిర్లక్ష్యంగా కూర్చొని పరిస్థితులు, పరిసరాలు గమనించకుండా,సెల్ ఫోన్ చూడటం లో కాని, పేపర్ చదవడం లో గాని నిమగ్నం కాకూడదు.సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి అదే విధంగా అధికారులకు కూడా తప్పనిసరిగా పెట్టుకునే విధంగా చెప్పాలి.అందరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ప్రజలకు పోలీసులు ఆదర్శంగా ఉండాలి.ట్రాఫిక్ రూల్స్ పాటించకుండ పోలీస్ ప్రతిష్ట కి భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తే శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు .ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు ,బెల్లంపల్లి 1 టౌన్ ఇన్స్పెక్టర్ దేవయ్య, ఆర్ఐ ఎం.టి.ఓ సంపత్,ఆర్ఐ వామన మూర్తి, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.
[5:18 pm, 4/10/2024] +91 98496 70892:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *