నిరుపేదలకు ఇందిరమ్మ నివాస గృహాలు మంజూరు చేయాలి

ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు,

డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్.

హసన్ పర్తి / నేటి ధాత్రి

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలో నివాస స్థలాలు లేని కడు నిరు పేద దళిత కుటుంబాలు గత మూడు సంవత్సరాల నుండి గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 516 లో సూమారుగా 70 కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం నివాస స్థలాలు ఇప్పించి ఇందిరమ్మ గృహాలు మంజూరి చేయాలని, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్‌ మానిటరింగ్ కమిటీ సభ్యులు, దళిత బహుజన ప్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో
జిల్లా కలెక్టరు ప్రావీణ్య మరియు ఆర్డివో కు బాధిత దళిత కుటుంబాలతో కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా చుంచు రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత అర్వూలైన నిరుపేద దళిత కుటుంబాలకు ప్రభుత్వ, పంచరాయి, ఇనాం అసైన్డ్ తదితర భూములను పంపిణి చేసి ఇందిరమ్మ నివాస గృహాలు మంజూరి చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. నిరుపేదలకు మద్దతుగా మాట తప్పకుండా ఇచ్చిన హమీలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించి, భూములకు హద్దులు నిర్ణయించాలని, భూ కబ్జాదారులనుండి భూములను కాపాడి భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సింగారపు రవి ప్రసాద్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అంకేశ్వరపు రాంచందర్ రావ్, నాయకులు దాసు, రాకేష్, మొగిలి, మధున,
జ్యోతి, సంద్య, లక్ష్మి, మమత,
శ్యామల, శిరోమణి, సరోజన, ప్రభ, భారతమ్మ, రాజయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!