నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని మూడవ వార్డు వల్లబ్ నగర్ లో చేపట్టిన గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహా అన్నప్రసాద మహోత్సవం చేపట్టారు.
నర్సంపేట టౌన్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డుకు పలువురు
అన్నదాతలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సుమారు 30 మంది
ప్రతి సంవత్సరం శ్రీ మహాగణపతి మాల ధారణ చేపట్టి వినాయక నవరాత్రుల ఉత్సవాలను నిర్వహిస్తారు.ఈ నేపథ్యంలో మండపం వద్ద భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మహా అన్నదానాలు,గణపతి భజనలతో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.మంచినీళ్ల సోమయ్య,కృష్ణమూర్తి శ్రీను, ఆంగోతు వెంకన్న,బాలు నాయక్,అక్కపెళ్లి రమేష్,కోరే శీను, బానోతు సమ్ములు,కోమల రాజేందర్, అజ్మీరా వెంకటి,సముద్రాల మహేందర్, ఇస్లావత్ వీరు,ఆంబోతు శివ కుమార్, మధుకర్, మంచినీళ్లు నాగరాజులు అన్నదాతలుగా ఉన్నారు.ఈ కార్యక్రమంలో గణపతి వనరాత్రుల ఉత్సవ కమిటీ,అలాగే 3 వార్డు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు భీరం నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.