గణపతి మండపం వద్ద మహా అన్న ప్రసాదం కార్యక్రమం

నిజాంపేట: నేటి ధాత్రి

వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలోగల మైసమ్మ గల్లి లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్న ప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వినాయకుడికి పూజ చేసి ప్రసాదాన్ని సమర్పించారు . ఈ సందర్భంగా మైసమ్మ గల్లి నిర్వహకులు మాట్లాడుతూ.. “అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న”అన్నారు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *