పార్లమెంట్ ఎన్నికలకు సకల సౌకర్యాలు కల్పించాలి

ఎన్నికల ప్రత్యేక అధికారి సంజీవరావు

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం నందు ప్రత్యేక అధికారి సంజీవ రావు ఆధ్వర్యంలో మే 13, 2024 న పార్లమెంటు ఎన్నికలు పోలింగ్ కేంద్రాలలో జరగబోవు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల నందు ఏర్పాట్లకు సంబంధించి తాగునీటి వసతి, టెంట్ సౌకర్యం, ర్యాంపు, విధ్యుత్ సౌకర్యం, ఎన్నికల విధులకు హాజరవుతున్న సిబ్బందికి భోజన వసతి, మరుగుదొడ్లు సౌకర్యాల వంటి అంశాలపై మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శాయంపేట తాహసిల్దార్ సుభాషిని, ఎంపీడీవో ఫణి చంద్ర, మండలంలోని 24 గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు, బి ఎల్ ఓ ఎస్ రేషన్ షాప్ డీలర్లు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *