
రైతులకు తప్పని తిప్పలు
ప్రభుత్వం అదుకోవాలని కొరుతున్న రైతులు
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మే – 8(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గంలో గాలి వానతో కూడిన అకాల వడ గాలుల వర్షం భారీగా కురిసింది. మంగళవారం మధ్యాహ్నం మొదలై రాత్రి వరకు ఏకధాటిగా కురవడంతో గాలి తీవ్రతకు రోడ్లపై చెట్లు విరిగి పడడంతో పాటు, కొనుగోలు కేంద్రాల్లో, బీట్ లలో వరి ధాన్యం తడిసి ముద్ద అవ్వడంతో రైతులు కన్నీటి పర్వంలో మునిగారు. కోతలు కోసి కొనుగోలు కేంద్రానికి తరలించిన ధాన్యం రాశులు కుప్పలు పూర్తిగా తడిసి పోవడంతో రైతులు ఏమి తోచని పరిస్థితుల్లో తీవ్రంగా రోదిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి పంట ఫలితం చేతికందే సమయంలో ప్రకృతి సృష్టించిన విపత్తుతో పూర్తిగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతు తడిసిన ధాన్యం వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.