భద్రత చర్యల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదు

భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల, మే – 2(నేటి ధాత్రి):
రాష్ట్ర ముఖ్యమంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా గురువారం రోజున సాయంత్రం పోలీస్ అధికారులతో కలసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి, భద్రతా చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బందోబస్తు పరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.భద్రత చర్యల్లో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. అనంతరం బహిరంగ సభాస్థలి, ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్ మ్యాప్, హెలిప్యాడ్, వి ఐ పి పార్కింగ్, ట్రాఫిక్ రూట్లు సభాస్థలికి వచ్చి వెళ్లే దారులు , జనరల్ పార్కింగ్ ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎస్పీ వెంట ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి, మురళి కృష్ణ, సి.ఐ లు రఘుపతి, అనిల్ కుమార్, శ్రీనివాస్, శ్రీనివాస్, ఎస్.ఐ లు సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!