సఖి కేంద్రం సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి

శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో సఖి సెంటర్ గురించి వివరిస్తూ మహిళలకుచెప్పడం జరిగింది.
సఖి వన్ స్టాప్ కేంద్రంహన్మకొండ నందు మహిళ అవగాహన సదస్సునిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సులో సఖి వన్ స్టాఫ్ కేంద్రం హరితమాట్లాడుతూ సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ మరియు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో సఖి వన్ స్టాప్ సెంటర్ నిర్వహించ బడుతున్నదని కేస్ వర్కర్ హరిత మాట్లాడుతూ చిన్నపిల్లలు లైంగిక వేధింపులకు గురి కావడం జరుగుతుందని వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టం తీసుకురావడం అయినదని వివరించడం జరిగింది అలాగే మహిళల కోసం గృహహింస చట్టం గురించి వివరించడం జరిగిందివిడిపోయే భార్యా భర్తలను కౌన్సిలింగ్ ద్వారా ఒకటిగా కలపడం చేస్తున్నదని,వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు,ఆడపిల్ల వద్దని అకారణంగా గర్భవిచ్చితి చేపించాలని వేధింపులకు గురి చేయడం మరియు ఇతర వేధింపుల పట్ల కృంగి పోయే మహిళలకు,బాలికలకు రక్షణ కల్పించడం కోసం సఖి వన్ స్టాఫ్ కేంద్రం కృషి చేస్తున్నదని,
సమస్యలపై సహాయం కోసం సఖి కేంద్రంకు వచ్చిన మహిళలకు ఉచితంగా కౌన్సిలింగ్ సహాయం ,న్యాయ సహాయం, పోలీస్ సహాయం ,వైద్య సహయం, తాత్కాలిక వసతి వంటివి సఖి కేంద్రం ద్వారా అందించ బడుతున్నదని తెలియ చేశారు.ఇట్టి అవకాశాన్ని సమస్యలు గల మహిళలు,బాలికలు ఉపయోగించు కోవాలని, అందుకోసం ఫోన్ నెంబర్స్ 0870-2452112 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 181 కు ఫోన్ చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో సఖి వన్ స్టాఫ్ కేంద్రం కేసు వర్కర్ హరిత వెన్నెల వివో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!