మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు తెగిపోయిన రోడ్డుకు మరమ్మత్తులు.

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో బస్టాండ్ నుండి పెద్దమ్మ తల్లి దేవాలయం వరకు వెళ్లే రోడ్డు ఇటీవల భారీ వర్షాలకు కొట్టుకుపోవడం జరిగింది అటు ప్రక్కనున్న రైతులు పొలాలు కోయుటకు వడ్లు తరలించడానికి రోడ్డు లేదు అని ఒడేడు గ్రామ రైతులు తెలుపగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెంటనే ఆదేశాల మేరకు డిసిసి ఉపాధ్యక్షులు మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ వెంటనే జెసిబి ని పంపించి రోడ్డుకు మరమ్మత్తులు చేపించడం జరిగింది..ఈ కార్యక్రమంలో ఓడేడు గ్రామ మాజీ సర్పంచి సిరికొండ బక్కారావు, గ్రామ శాఖ అధ్యక్షులు దాసరి చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవునూరి సదానందం,బొల్లపల్లి పోశాలు,తోట సుధాకర్,నరాల మల్లన్న, తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *