*అదనపు కలెక్టర్ కి వినతి పత్రం
బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిని పల్లి మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ క్యాంపులు మండలంలో మూడు ఏర్పాటు చేయాలి.1, బోయినిపల్లి, 2, విలాసాగర్, 3, కొదురుపాక ఈ మూడు గ్రామాలలో ఏర్పాటు చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
బోయినిపల్లి మండల కేంద్రంలో గత రెండు నెలల నుండి ఆధార్ సెంటర్ క్యాంపు కార్యాలయం ఎత్తివేయడం వల్ల, మరి అందుబాటు లేకపోవడంతో బోయినిపల్లి మండల కేంద్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇక్కడి నుండి గంగాధర మండల కేంద్రానికి ఆధార్ సేవలు గురించి ప్రజలు పోవడం జరుగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో ఆధార్ కార్డు అప్డేట్ పేరుతో, పాన్ కార్డు పేరుతో, మరి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలని, అలాగే రేషన్ కార్డుకు చేసుకోవాలని, మరి హెల్త్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని వివిధ రకాల సేవలు పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మండలానికి మూడు మేజర్ గ్రామాలను గుర్తించి ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు సేవలు సులభతరంగా ఉంటాయి. జిల్లా స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి అని, అలాగే ఆధార్ కార్డు అనుసంధా ప్రక్రియలు, ఎలాంటి సేవలకైనా ప్రభుత్వం గడువు తేదీ లేకుండా నిరంతర ప్రక్రియ కొనసాగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, ఎగమాటి ఎల్లారెడ్డి, సవన్ పెళ్లి రాములు, నక్క పరశురాం, లోకుర్తి రాజు.