గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం తీవ్ర జ్వరాలు డెంగ్యూ లక్షణాలతో మంచాల పడుతున్న ప్రజలు పోతారం

గ్రామంలో ప్రజలే సొంత డబ్బులతో బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేసి చల్లుతున్న వైనం
ఇంత జరుగుతున్న చోద్యం చూస్తున్న పంచాయతీ పాలకవర్గం పాలకవర్గంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పోతారం గ్రామస్తులు

ముత్తారం :- నేటి ధాత్రి

ఏ ఇంట్లో చూసినా ఎవరో ఒకరు జ్వరంతో మంచంలో పడివున్నారు గ్రామాల్లో చెత్త చెదారం నీరు నిల్వ చేరడం తో దోమలు సైర్య విహారం చేస్తున్నాయి ఎక్కడ వేసిన పారిశుద్ధ్యం అక్కడే పడకేసింది దీంతో గ్రామంలో దోమలు సైరవిహారం చేసి ప్రజలను కాటు వేస్తుండడంతో గ్రామాల్లోని ప్రజలు తీవ్ర జ్వరాలతో డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్నారు ప్రైవేటు దావకానాలకు పోయి వేళల్లో ఖర్చులు పెడుతున్నారు ఇంత జరుగుతున్న గ్రామపంచాయతీ పాలకవర్గ మాత్రం గ్రామాల్లో పారిశుధ్యం పనులు చేపట్టడం లేదు సైడ్ డ్రైన్లు పూడిక తీయకపోవడంతో మురికి వాసన కంపు కొడుతుంది దీంతో దోమలు పుట్టగొడుగుల పుట్టుక వస్తున్నాయి చేసేది లేక గ్రామ ప్రజలు సొంత ఖర్చులతో బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేసి ఎవరి ఇండ్లకు వాళ్లే చల్లుకుంటున్న దృశ్యం చూడాలంటే ముత్తారం మండలంలోని పోతారం గ్రామంలోకి పోవాల్సిందే ఆ గ్రామంలో పారిశుద్యం లోపించడంతో ప్రజలు మంచానా పట్టి జ్వ రాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇటు పాలకవర్గం అటు మండల అభివృద్ధి అధికారులు గ్రామాన్ని సందర్శించకపోవడంతో పాటు ఇటు వైద్య బృందం కూడా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తామే సొంత ఖర్చులు తో బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేసి చల్లుకుంటున్నమని వారు ఆవేదనతో తెలుపుతున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామాన్ని సందర్శించి గ్రామంలో పారిశుద్యం పనులు జరిగేలా చూడాలని ప్రజలు వేడుకుంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!