*మద్దెల బాబు మృతిపై మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంతాపం*
*పరకాల,నేటిధాత్రి*
పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడు మద్దెల బాబు(రాజయ్య)ఆకస్మిక మృతిపై పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.గుండెపోటుతో శుక్రవారం ఉదయం మద్దెల బాబు మృతిచెందిన విషయం తెలుసుకున్న ఆయన నాగారం గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా మద్దెల బాబు పార్థివ దేహానికి పూలమాల వేసినివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు.మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ మద్దెల బాబు పార్టీకి అంకితభావంతో పనిచేసిన నిబద్ధత కలిగిన నాయకుడని ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీవ్ర వేదన కలిగించింది.గ్రామ ప్రజలకు,పార్టీ కార్యకర్తలకు ఇది తీరని లోటు అని పేర్కొన్నారు.కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,పార్టీ కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.
