*17న అండర్ 16 బాయ్స్ జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక..
*సిడిసిఏ అధ్యక్ష,కార్యదర్శులు శ్రీనివాసమూర్తి, సతీష్ యాదవ్…
తిరుపతి(నేటిధాత్రి:
ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్(సిడిసిఏ) ఆధ్వర్యంలో మే 14వ తేదీ ఆదివారం అండర్ 16 బాయ్స్ జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు సిడిసిఏ అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, కార్యదర్శి సతీష్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ క్రికెట్ సెలక్షన్స్ తిరుపతి స్థానిక మంగళం రోడ్డులోని కజారియా టైల్స్ ఎదురుగా ఉన్న సీవీ క్రికెట్ అకాడమీ నందు ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సెలక్షన్స్ లో హాజరగు అండర్ 16 బాయ్స్ 1.9.2010 తరువాత, 31.08.2012 లోపు జన్మించిన వారై ఉండాలన్నారు. ఆదివారం జరిగే ఈ సెలక్షన్స్ లో పాల్గొనే క్రికెట్ క్రీడాకారులు తెల్లని దుస్తులు, తమ సొంత క్రీడా సామాగ్రితో పాటు ఆధార్ కార్డు, జన్మ ధ్రువీకరణ పత్రము తప్పక తీసుకురావాలని సూచించారు. ఈ సెలక్షన్స్ కు ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రీడాకారులు మాత్రమే అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఈ క్రికెట్ సెలక్షన్స్ ను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మరిన్ని వివరాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సతీష్ యాదవ్ 8886185559, కోచ్ సునీల్ కుమార్ 9000214966, కోచ్ చిన్నబాబు 798188 0381 లను చరవాణి ద్వారా సంప్రదించవలసిందిగా వారు కోరారు…
