300 కోట్లతో తాలిపేరు ప్రాజెక్టు అభివృద్ధి చేయాలి
సీనియర్ జర్నలిస్ట్ వందే నరసింహ
నేటి ధాత్రి చర్ల
చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ ను పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలి సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఈ ప్రాంతంలో పర్యటించి 300 కోట్లతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి పూసుగుప్ప ఉప్పరగూడెం కొయ్యూరు లక్ష్మీ కాలనీ సుబ్బంపేట పెద్ద ముసలేరు చిన్న ముసలేరు తిప్పాపురం గ్రామపంచాయతీ లోని పంట పొలాలకు పూర్తిస్థాయిలో గ్రావిటీ కెనాల్ ద్వారా గాని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గాని పూర్తిస్థాయిలో పంట పొలాలకు సాగు నీటిని అందించాలని సీనియర్ జర్నలిస్ట్ నరసింహ అన్నారు ఈ ప్రాంతంలోని దళిత గిరిజన యువతకు తాళిపేరు ప్రాజెక్టులో ఉపాధి అవకాశం కల్పించాలి చర్ల మండలంలోని ప్రతి చెరువును పూర్తిస్థాయిలో మిషనరీ సహాయంతో పూడికను తీసి రైతుల పంట పొలాలకు ట్రాక్టర్ల ద్వారా ప్రభుత్వం ఉచితంగా అందించాలి ప్రతి చెరువులలో తాలిపేరు ప్రాజెక్టు లో చేపల పెంపకం చేపట్టి దళిత గిరిజన మత్య సహకార సొసైటీలు ఏర్పరచి ఈ ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశం కల్పించాలి ప్రభుత్వం
ప్రాజెక్ట్ అంతర్భాగం 1400 ఎకరాలలో పూర్తిస్థాయిలో పూడికను తొలగించి రైతులకు ఉచితంగా మట్టిని అందించాలి విరివిగా కొబ్బరి చెట్లు నాటి పర్యాటకంగా అభివృద్ధి చేయాలి హరిత హోటల్స్ కట్టి పర్యాటకం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి 300 కోట్లతో తాళిపేరు ప్రాజెక్టు పరిధిలో పూర్తిస్థాయిలో అన్ని రకాలుగా సదుపాయాలు అన్ని కల్పించి ఈ ప్రాంత గిరిజన దళిత రైతుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలని చర్ల మండల ప్రజలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు
