యాదాద్రి లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు
యాదగిరిగుట్ట నేటి ధాత్రి:
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని క్షేత్రపాలకులు ఆంజనేయ స్వామి వారీని వివిధ రకాల పువ్వులతో అలంకరించి, ఆంజనేయ స్వామికి ఇష్టమైన పూజలు ఆకు పూజ చేసి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
