ఆటో డ్రైవర్ నిజాయితీ
యాదగిరిగుట్ట నేటి ధాత్రి:
యాదగిరిగుట్టలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆటోడ్రైవర్ హరిబాబు తన నిజాయితీని చాటుకున్నాడు, హైదరాబాదుకు చెందిన భక్తురాలు లక్ష్మీనరసింహస్వామి దర్శన నిమిత్తం ఆటో ఎక్కి దిగేముందు ఆటోలో మూడు తులాల బంగారి పుస్తెలతాడు మరిచిపోయింది.
మూడు తులాల బంగారు పూసలతాడును ఆటో డ్రైవర్ హరిబాబు పోలీసులకు అప్పగించాడు. ఆలయ ఈవో భవాని శంకర్ ఇన్స్పెక్టర్ సమక్షంలో ఆ బంగారాన్ని బాధితురాలికి అందజేశారు. దురాశకు పోకుండా బంగారాన్ని పోలీసులకు అప్పగించడాన్నే ఆలయ అధికారులు,పోలీసు సిబ్బంది, భక్తులు హరిబాబును అభినందించారు.
