Maize Farmers Stage Rasta Roko
మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కరించాలనిరాస్తారోకో
తెలంగాణ రైతు సంఘం ఏ ఐ కె ఎస్
కేసముద్రం/ నేటి దాత్రి
కేసముద్రం మండలం తాళ్లపసపల్లి గ్రామం లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మార్తినేని పాపారావు. రైతు సంఘం మండల అధ్యక్షుడు నీరుటిజలంధర్ రైతుల సమస్యలు తెలుసుకుని రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించడం జరిగింది. తాళ్లపూసపెళ్ళిలో 15 రోజుల క్రితం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు, మొక్కజొన్నలు నింపడానికి 10వేల బస్తాలు ప్రభుత్వం పంపిణీ చేసిందని, వాటిని మాత్రమే కాంటాలు పెట్టారని ఆరు లారీల్లో 6300 బస్తాలు తరలించారని ఈరోజు లారీల్లో వారు 2000 బస్తాలు తరలిస్తారని ఇక్కడ నిర్వాహకులు చెప్పారని, 20 రోజుల క్రితం మొక్కజొన్నలు తీసుకువచ్చి రాశులు పోసామని కాళీ బస్తాలుఇవ్వలేదు, మీరే కొనుక్కోచుకోమంటే తెచ్చుకుందామని అయినా బస్తాల్లో నింపట్లేదని అడుగుతే ఆన్లైన్ అయితే నింపుతం అంటున్నారని, 15 రోజుల్లో నుండి ఇక్కడ కావాలి పడుకో లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు తమ ఆవేదన తెలియజేశారని, నిన్న గాలి దుమారం అకాల వర్షానికి ఇబ్బంది పడ్డామని త్వరగా బస్తాలు అందించి కంటాలు పెట్టించి లారీలు తీసుకొచ్చి తరలించాలని రైతులు వారి ఆవేదన తెలియజేయడం జరిగింది. రైతులకు మద్దతుగా కొనుగోలు కేంద్రం ఎదురుగా ఉన్న కేసముద్రం మహబూబాద్ ప్రధాన రహదారిపై బైటాయించి ఆందోళన చేయడం జరిగింది, ఇంకా కొనుగోలు కేంద్రంలో 30 వేల బస్తాలు కాంటాలు పెట్టి తరలించాల్సి ఉందని, ఈ కొనుగోలు కేంద్రం పరిధిలోని గ్రామాల్లో ఇంకా రైతుల కళ్ళల్లో మొక్కజొన్నలు ఉన్నాయని త్వరగా తరలించాలని రాస్తారోకో చేయడం జరిగిందని . రేపు కలెక్టర్ ని కలిసి
మొక్కజొన్న,వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొనే ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో, ఈ కార్యక్రమంలో మాదా శ్రీనివాస్, కాలేరు రామ్మూర్తి, మేకల మురళి బానోత్ కిషన్, కాలేరు వెంకటమ్మ భాదవత్ రమేష్ రాములు నాయక్, మోక్ష వెంకటేష్, సారయ్య, వెంకన్న,నర్సయ్య, పీరియా రైతులు తదితరులు పాల్గొన్నారు.
