Free Eye Camp for Drivers
డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
చెన్నూరు సిఐ బన్సీలాల్
మంచిర్యాల,నేటి ధాత్రి:
రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం చెన్నూరు సిఐ బన్సిలాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్,జైపూర్ ఏసీపీ వెంకటేశ్వరులు సందర్శించి డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో స్పష్టమైన చూపు అత్యంత ముఖ్యమని,ప్రతి డ్రైవర్ సమయానుకూలంగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.అదేవిదంగా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించవలసిన నిబంధనలను వారికి వివరించారు.ఈ శిబిరంలో సుమారు 150 మంది ఆటో,టాక్సీ డ్రైవర్లు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.వీరిలో 24 మందికి ఉచితంగా కళ్లద్దాలు అందించగా,5 మందిని కంటి శస్త్రచికిత్స కోసం ఎంపిక చేసి పంపించారు.
గాంధీ చౌక్లో “చలి వేంద్రం” ప్రారంభం
వేసవిలో ప్రజలకు చల్లని తాగునీటి సదుపాయం.గాంధీ చౌక్ వద్ద డీసీపీ భాస్కర్,ఏసీపీ వెంకటేశ్వరులు సమక్షంలో చెన్నూర్ పట్టణ పోలీసులు చలి వేంద్రం ను ప్రారంభించారు.వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చుట్టు ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.ఈ కార్యక్రమంలో చెన్నూర్ పట్టణ ఎస్సై లు శ్యాంపటేల్, సుబ్బారావు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
