Demand for Gandhi Statue in Parakala
మహాత్మ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలి ఆముదాలపల్లి మల్లేష్ గౌడ్
పరకాల,నేటిధాత్రి
పట్టణంలో మహాత్మ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ ఆముదాలపల్లి మల్లేష్ గౌడ్ కోరారు.దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మ గాంధీ చేసిన త్యాగాలు,ఆయన చూపిన అహింసా మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.పట్టణంలో గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే యువతకు చరిత్రపై అవగాహన పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.ముఖ్యంగా విద్యార్థులు,యువతలో దేశభక్తి భావనను పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.ఈ మేరకు సంబంధిత అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించి తగిన స్థలాన్ని గుర్తించి విగ్రహం ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.పట్టణ అభివృద్ధితో పాటు చారిత్రక మహానుభావుల స్మృతులను కాపాడటం కూడా సమాజ బాధ్యత అని మల్లేష్ గౌడ్ తెలిపారు.
