సబ్సిడీ రుణాల గడువును పెంచాలి
తెలంగాణ మాదిగ జర్నలిస్టులఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెపాక భాస్కర్
పరకాల,నేటిధాత్రి
రాష్ట్ర వ్యాప్తంగాఎస్సీ కులస్తులకు జీవనోపాధి కల్పించి వారి అభివృద్ధి చెందుటకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను అందించుటకు ఈనెల 24 వరకు ఉన్న గడువును అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు పొడిగించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టులఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెపాక భాస్కర్ అన్నారు.వ్యాపారానికి సంబంధించిన యూనిట్లను కూడా ప్రవేశపెట్టి ఎక్కువ యూనిట్లను పెంచాలని దరఖాస్తు చేయడానికి కులము,ఆదాయం సర్టిఫికెట్లు తప్పనిసరి కాబట్టి రెండు రోజులు సెలవులు ఉండడం వలన రెవెన్యూ కార్యాలయం నుండి సర్టిఫికెట్లు అందక చాలామంది కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేయలేకపోయారని రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్ ఆలోచన చేసి గడువు తేదీని పొడగించాలని కోరారు.
