“Sarpanch Donates ₹11,000 for Ramzan”
సర్పంచ్ జగదాంబ రంజాన్ సందర్భంగా మసీదు కమిటీకి రూ.11,000 అందజేత
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని డప్పూర్ గ్రామ సర్పంచ్ జగదాంబ, పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకున ముస్లిం సోదరులకు స్థానిక మసీదు కమిటీకి రూ.11,000 నగదును అందజేశారు. ఎన్నికల సమయంలో విజయదశమి, క్రిస్మస్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, రంజాన్ వంటి పండుగలకు ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే క్రిస్మస్ సందర్భంగా సహాయం అందించిన జగదాంబ, తాజాగా రంజాన్ పండుగకు కూడా చేయూతనిస్తూ తన మాట నిలబెట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్, స్థానికులు పాల్గొన్నారు.
