పది పరీక్షలకు 6 మంది విద్యార్థులు గైర్హాజరు
పది పరీక్షలు రాసిన ఇద్దరు ప్రత్యేక ప్రతిభావంతులు
రామచంద్రపురం(నేటిధాత్రి:
మండలంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన తెలుగు పరీక్షకు ఆరు మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు మండల విద్యాశాఖ అధికారి వి మార్కండేయ నాయుడు తెలిపారు. మండలంలో నెత్త కుప్పం, కుప్పం బాదూరు, కమ్మ కండ్రిగ, సొరకాయల పాల్యం, కే కే వి పురం పరీక్ష కేంద్రాలలో రెగ్యులర్ విద్యార్థులు328 మంది, ప్రైవేటు విద్యార్థులు 6తో కలిపి మొత్తం 334 మంది హాజరు కావాల్సి ఉండగా 328 మంది హాజరయ్యారు. ఇద్దరు రెగ్యులర్ విద్యార్థులు, నలుగురు ప్రైవేట్ విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు , సొరకాయల పాల్యం పరీక్షా కేంద్రంలో కాయంపేట, పత్తి పుత్తూరు,కమ్మ కండ్రిగ పరీక్ష కేంద్రంలో దుర్గ సముద్రం పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కమ్మ కండ్రిగ పరీక్షా కేంద్రంలో లావణ్య, మురారి ఇద్దరు ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులు పరీక్షలకు హాజరై, సహాయకులచే పరీక్షలు వ్రాయించారు.పరీక్షా కేంద్రాల వద్ద ఎస్సై భక్తవత్సలం గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసి 144 సెక్షన్ విధించారు..
