Collector Launches Praja Palana Awareness Program
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..
తంగళ్ళపల్లి మండలం .జిల్లెల్ల గ్రామంలోనీ. వ్యవసాయ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు .సర్పంచ్లకు. ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈరోజు జిల్లెల్ల గ్రామ శివారులోని నూతనంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిలకు సర్పంచులకు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం జిల్లెల్ల కాన్ఫరెన్స్ హాలులో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని. ఇందులో భాగంగా ఈరోజు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ ఆధ్వర్యంలో. జ్యోతి వెలిగించి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈరోజు వ్యవసాయ కళాశాలలో మండలంలోని అలాగే మున్సిపల్ పరిధిలోని అధ్యక్షులు కౌన్సిలర్లు సర్పంచులు ప్రజా ప్రతినిధుల అందరికీ ప్రజా పరిపాలన ప్రణాళికలో భాగంగా ఒక్కరోజు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని. ఇందులో అనేక విషయాలపై పలు సమస్యలపై తెలుసుకోవడంతో పాటు గ్రామ పరిపాలనలో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా .ఒడిడోడుకులకు. గురికాకుండా శిక్షణ కార్యక్రమంలో అన్ని విషయాలపై క్షుణ్ణంగా పరిశీలనలతోఅవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్. జిల్లా .ఎస్పీ .మహేష్ బి.గితే. అదనపు .కలెక్టర్ .గడ్డం నగేష్. నూతనంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు మున్సిపల్ అధ్యక్షులు గ్రామ సర్పంచ్లు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు
