Road Laid, But No Water Curing in Kalwakurthy
రోడ్డు వేశారు నీరు మరిచారు.
కల్వకుర్తి/ నేటి ధాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా పోస్ట్ ఆఫీస్ పక్కన ప్రధాన రహదారి నుండి మార్కెట్ రోడ్డు ప్రధాన రహదారి వరకు, గాంధీనగర్ లో కోట్ల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు వేశారు కానీ రోడ్లు వేసిన తర్వాత రోడ్డు బలంగా పటిష్టంగా కావడానికి కనీసం 10 నుంచి 15 రోజుల వరకు నీరు పట్టాలి కానీ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ ఒక్కసారి మాత్రమే ఆ రోడ్డుకు నీరు పట్టారు సంబంధిత శాఖ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తి నట్టుగా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణాలు చేపట్టి ఇలా గాలికి వదిలేస్తే ప్రజాధనం వృధా అవుతుంది అని రోడ్డు నిర్మాణాలు పటిష్టత కోల్పోయి త్వరగా రోడ్లు చెడిపోతాయని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
