370 మంది కార్మికులు కాంగ్రెస్ పార్టీలో చేరిక

పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సింగరేణి వేబ్రిడ్జి కోల్ లారీ లోడింగ్ అన్లోడింగ్ . లెవెలింగ్ తార్ఫాలింగ్ వర్కర్ యూనియన్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బౌత్ విజయ్ కుమార్ 370 మంది కార్మికులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాను సింగరేణి జిఎంతో మాట్లాడి కార్మికులకు హెల్త్ కార్డులు మంజూరయ్య విధంగా సహాయ సహకారాలు అందిస్తాను కార్మికులందరికీ పిఎఫ్ సౌకర్యం అందేలా కృషి చేస్తాను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి భూపాలపల్లి నియోజకవర్గం నుండి లక్ష మెజార్టీ రావాలని అందరిని కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తుంది ఈ కార్యక్రమంలో
కార్మిక సంఘం అధ్యక్షులు బౌత్ విజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి రాజబాబు. ఉపాధ్యక్షులు బిక్షపతి క్యాషియర్ పోలవేణి రమేష్. సహకార దర్శి ఎండి సాహెబ్ ఆర్గనైజర్స్ రాజమౌళి సభ్యులు కూడా పాక కొమురయ్య బొల్లి మల్లయ్య తుమ్మడి శ్రీనివాస్ తిప్పని రవీందర్ అశోక్ పోనగంటి కొమురయ్య జాడి రాజయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *