లైసెన్స్‌ విత్తనాలను కొనుగోలు చేయాలి

లైసెన్స్‌ విత్తనాలను కొనుగోలు చేయాలి

నర్సంపేట ఏసీపీ సునీతామోహన్‌

రైతులు విత్తనాలు కొనుగోలు సమయంలో లైసెన్సు కలిగిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని నర్సంపేట ఏసీపీ సునీతామోహన్‌ అన్నారు. శుక్రవారం పోలీస్‌, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో చేపట్టి నకిలీ విత్తనాలు పట్టివేతకు సంబంధించిన అక్రమ వ్యాపారి అరెస్టు వివరాలను శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ కరీంనగర్‌ జిల్లా కేశవపట్టణం మండలం చింతగుట్ట గ్రామానికి చెందిన కరివెద సదాశివరెడ్డి అనే అక్రమ వ్యాపారి ప్రభుత్వ లైసెన్సు, ఎలాంటి లేబుల్స్‌ లేకుండా 22 క్వింటాళ్ల నకిలీ మొక్కజొన్న విత్తనాలను రైతులకు విక్రయిస్తుండగా నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌ చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీల్లో భాగంగా పట్టుకున్నామని తెలిపారు. వెంటనే పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా నిందితుడిని గ్రామంలో మరో 65క్వింటాలు మొత్తం 146 బ్యాగులల్లో 87క్వింటాలు, 17లక్షల 40వేలు విలువ ఉంటుందని నకిలీ మొక్కజొన్నలను స్వాధీనపరచుకుని విత్తన చట్టం కింద కేసు నమోదుచేసి నిందితుడు సదాశివరెడ్డితోపాటు మరో నిందితుడు కొయ్యడ రాజులను అరెస్టుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ సునీత మోహన్‌ తెలిపారు. చాకచక్యంగా ఛేదించి నకిలీ విత్తనాలను పట్టుకున్న సిఐ దేవేందర్‌రెడ్డి, ఏడీఏ శ్రీనివాస్‌రావులను ఏసీపీ అభినందించారు. ఈ సమావేశంలో నర్సంపేట టౌన్‌ సీఐ దేవెందర్‌రెడ్డి, నర్సంపేట వ్యవసాయశాఖ సంచాలకులు శ్రీనివాసరావు, ఏవో కష్ణకుమార్‌, ఎస్సై నాగ్‌నాథ్‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *