సంకాపూర్ రైల్వే స్టేషన్లో ఘటన.
మృతుడు లింగాపూర్ గ్రామానికి చెందిన నరేష్ గౌడ్.
రామాయంపేట(మెద)నేటి ధాత్రి.
ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సంకాపూర్ రైల్వే స్టేషన్లో జరిగింది. మృతుని బంధువులు కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం రామయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన తిప్పాపూర్ నరేష్ గౌడ్ 28 అనే యువకుడు తన బంధువుల ఇంటికి సంకాపూర్ వెళ్లినట్లు తెలిపారు. శనివారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తూ ప్లాట్ఫారం దాటుతుండగా రైలు ఢీకొని మరణించినట్లు తెలిపారు. గ్రామంలో విషాద ఛాయల అలుముకున్నాయి. మృతుని కుటుంబానికి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరారు.