పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి

ధర్మసాగర్, నేటిధాత్రి:
గర్భిణీలు, బాలింతలు, పిల్లలు మంచి పోషకాహార విలువలు కలిగిన ఆహార పదార్ధాలను తీసుకున్నప్పుడే మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారని సోమదేవరపల్లి సర్పంచ్ తోట మంజుల అన్నారు. శనివారం సోమదేవరపల్లి అంగన్వాడీ కేంద్రం-2 లో అక్షరాబ్యాసం, చేతుల పరిశుభ్రత, పోషకాహార ప్రదర్శనలు తదితర వాటిపై అవగాహన కార్యక్రమాన్నీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ తోట మంజుల హాజరై మాట్లాడుతూ మంచి పోషకాలు కలిగిన ఆహార పదార్ధాలను తీసుకున్నప్పుడే పూర్తి ఆరోగ్యం గా ఉండగలమని అన్నారు. ఎంపీటీసీ లక్క సునీత మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ప్రజలు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ అరుణ, అంగన్వాడీ టీచర్ రజిత, ఎఎన్ఎం విజయ, ఆశ రజిత, గోనెల శ్రీనివాస్, మధుకర్, రాజయ్య, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *