నిమ్స్ లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి గారిని శుక్ర‌వారం పరామర్శించిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు.

రెండు రోజుల జిల్లా ప‌ర్య‌ట‌న ముగించుకొని శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్ కు వ‌చ్చిన మంత్రి. 

నేరుగా నిమ్స్‌కు వెళ్లి ప్రీతి ఆరోగ్యంపై స‌మీక్ష‌. 

 

ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్, చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని అడిగి తెల్సుకున్న మంత్రి హరీశ్ రావు.  

 

అత్యుత్తమ వైద్యం అందించాల‌ని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యుల‌ను ఆదేశించిన మంత్రి హరీశ్ రావు.  

 

ప్రీతి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చి, ధైర్యం చెప్పిన మంత్రి హరీశ్ రావు. 

 

ప్రభుత్వం అండగా ఉంటుందని భ‌రోసా ఇచ్చిన మంత్రి. 

 

విచారణ పూర్తి నిష్పాక్షికంగా జ‌రుగుతుంద‌ని, దోషులు ఎంత‌టివారైనా క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హామీ ఇచ్చిన మంత్రి హ‌రీశ్ రావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *