నకిలీ విత్తనాలు స్వాధీనం

50క్వింటాల నకిలీ మొక్కజొన్న విత్తనాలు స్వాధీనం

నర్సంపేట డివిజన్‌లో మళ్లీ నకిలీ విత్తనాలను కొందరు అక్రమ వ్యాపారులు రైతులకు అంటకడదామని పనిలో పడ్డారు. అక్రమ వ్యాపారాన్ని పసిగట్టిన పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు వెంటనే రైతుల శ్రేయస్సు కోసం వారి నిజాయితీని నిరూపించుకున్నారు. పోలీస్‌, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్‌ను చాకచక్యంగా ఛేదించారు. మూడుగంటల వ్యవధిలోనే ఇతర జిల్లాకు వెళ్లి అక్రమ దందా గట్టురట్టు చేశారు. నర్సంపేట అర్బన్‌ సిఐ కొత్త దేవేందర్‌రెడ్డి, నర్సంపేట వ్యవసాయ శాఖ సంచాలకులు శ్రీనివాస్‌రావులు తెలిపిన కథనం ప్రకారం…కొత్తగూడెం మండలం ఓటాయి గ్రామానికి చెందిన కొందరు రైతులు శుక్రవారం మధ్యాహ్నం నర్సంపేటలో మొక్కజొన్న విత్తనాలను బస్తాలలో తీసుకువెళుతుండగా వెంటనే అనుమానంతో పరిశీలన చేయగా ప్రభుత్వ గుర్తింపు పొందని నకిలీ మొక్కజొన్న విత్తనాలుగా ఉన్నట్లు గుర్తించామన్నారు. కొనుగోలు చేసిన రైతులతో వివరాలను అడిగి తెలుసుకొని విత్తనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వెంటనే పోలీస్‌, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో కరీంనగర్‌ జిల్లా కేశవ పట్టణం మండలం చింతగుట్ట గ్రామంలో సదాశివరెడ్డి అనే వ్యక్తి ఆడా, మగా హైబ్రీడ్‌ మొక్కజొన్న విత్తనాల ఆర్గనైజింగ్‌ చేస్తున్నాడు. గోదాం వద్ద తనిఖీలు నిర్వహించగా ప్రభుత్వ గుర్తింపు పొందని 50క్వింటాల నకిలీ మొక్కజొన్న విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విత్తనాల స్వాధీనం అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు నర్సంపేట టౌన్‌ సిఐ దేవేందర్‌రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *