ఓట్లుంటేనే ఓదార్పులా” “నేటిధాత్రి” కథనానికి “కడియం” స్పందన

*గత ఏడాది తల్లి, పది రోజుల క్రితం తండ్రి…*

*తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయి అనాధలుగా మిగిలిన పసిపిల్లలు*

*అన్ని రకాలుగా పిల్లలను ఆదుకుంటామని కడియం ప్రకటన*

*ఐనవోలు* గ్రామానికి చెందిన చిన్నారులు *ప్రణయ్, నందులపై “నేటిధాత్రి” దినపత్రికలో వచ్చిన కథనానికి తెలంగాణ మాజీ ఉప  ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ “కడియం శ్రీహరి” స్పందించారు*. అనాధలైన పిల్లలను ఆదుకుంటామని చెప్పారు. గత ఏడాది జూన్ లో కన్న తల్లి చనిపోయింది. గత పది రోజుల క్రితం తండ్రి చనిపోవడంతో పిల్లలు అనాధలయ్యారు. జరిగిన *సంఘటన తెలియగానే నేటిధాత్రిలో ఆ పిల్లలుపై ఈ రోజు  ‘ఓట్లుంటేనే ఓదార్పులా” అనే కథనం ప్రచురించడం జరిగింది. ఆ వార్తను చూసిన కడియం శ్రీహరి ఆ పిల్లలకు సంబంధించి అన్ని రకాల సహాయసహారాలు అందించేందుకు ముందుకొచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు.* ఆ పిల్లల విషయంలో మరింత మంది మానవతా హృదయులు ముందుకొస్తే వారి జీవితం తెగిన గాలిపటం కాకుండా వుంటుంది. *నిరుపేదలైన దళిత పిల్లలను ఆదుకోవాల్సిందిగా “నేటిధాత్రి” మనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *