అందరూ అక్షరాస్యులు కావాలి

ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు కావాలని 65 వ డివిజన్ కార్పొరేటర్ దివ్యరాణీరాజు నాయక్ కోరారు. డివిజన్ పరిధిలోని సుబ్బయ్య పల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన అక్షర భారత్ -అక్షర వెలుగు సెంటర్ ను కార్పొరేటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పోరేటర్ మాట్లాడుతూ ప్రతి మనిషికి చదువు అనేది ఎంతో ముఖ్యమైనదని, ఒక కుటుంబ ఆర్థిక పరిస్థితి మారాలన్నా అది చదువుతోనే సాధ్యమని అన్నారు. నిరక్షరాస్యులైన వయోజనులు అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చేసుకొని అక్షరాస్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అక్షర భారత్ జిల్లా కోఆర్డినేటర్ క్రాంతి, పుట్ట విజిత, పుట్ట శారద, రమ, నిర్మల, సమ్మవ్వ, పోలేపాక దయానంద్, పుట్ట వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *