భద్రాచలం శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో 5 కేజీల బరువు గల శిశువు జననం

భద్రాచలం శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో 5 కేజీల బరువు గల శిశువు జననం

సాధారణంగా శిశువులు 3 నుంచి 4 కేజీల మధ్యలో జన్మిస్తూ ఉంటారు. కానీ భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్ లోని శ్రీ సురక్ష మల్టీస్పెషల్టి హాస్పిటల్ లో సోమవారం రాత్రి 5 కేజీల బరువుతో మగ శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించింది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యం కూడా క్షేమంగా ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గ్రామానికి చెందిన కె.శ్రావణి పురిటి నొప్పులతో బాధపడుతూ కాన్పు కోసం భద్రాచలం అంబేద్కర్ సెంటర్ లోని శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్* లో చేరింది. అక్కడ ఆమెని పరీక్షించిన గైనకాలజిస్ట్ సూరపనేని.శ్రీక్రాంతి, అనస్థీషియా వైద్య నిపుణులు డాక్టర్ అక్కినేని. లోకేష్గార్ల ఆద్వర్యంలో ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించగా, ఆమె 5 కేజీల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే సోమవారం రాత్రి జన్మించిన ఈ శిశువు సాధారన బరువుకంటే కూడా ఎక్కువగా ఉండడం గమనార్హం.


మొదటి కాన్పులో శ్రావణికి బాబు జన్మించిందనీ , రెండో కాన్పులో కూడా బాబుకు జన్మనిచ్చింది అని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఈ
శాస్త్ర చికిత్స లో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్:వై.రాజశేఖర్ రెడ్డి పాల్గొనీ జన్మించిన శిశువుకు చికిత్స అందించారు. మహిళ బంధువులు వైద్యులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *