బాబుకు ఓటమి భయం పట్టుకుందా…?రిటర్న్‌ గిఫ్ట్‌ ఫలిస్తుందా…?

రిటర్న్‌ గిఫ్ట్‌ ఫలిస్తుందా…?

బాబుకు ఓటమి భయం పట్టుకుందా…?

నేటిధాత్రి బ్యూరో : ఆంద్రప్రదేశ్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి బాట పట్టనుందా…? అక్కడ జగన్‌ వాహా కొనసాగుతుందా…? గురువారం జరిగిన ఎన్నికల్లో మెజార్టీ శాతం ఆంద్రప్రజలు జగన్‌ వైపే మొగ్గుచూపారా…? ప్యాన్‌ గాలికి సైకిల్‌ కుదేలు కానుందా…? ఇలాంటి అనేకరకాల అనుమానాలు, ప్రశ్నలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కలుగుతున్నాయిట. మెజార్టీ ప్రజలు జగన్‌నే సమర్థించారని సంకేతాలు వెలువడుతున్నాయట. దీంతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు ఓటమి భయం పట్టుకుందనే ప్రచారం ఇక్కడ జోరుగానే కొనసాగుతుంది. రెండోసారి అధికార పీఠం ఎక్కేందుకు చంద్రబాబు తన సర్వశక్తులు ధారపోసి విజయం బాటన కొనసాగేందుకు ప్రయత్నించిన ఈసారి జగన్‌కే ఎపీ ప్రజలు పట్టం కట్టనున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు అంటున్నారు.

బాబుకు ముందే తెలుసా…?

ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు నుంచే చంద్రబాబుకు ఇంటిలిజెన్స్‌ రిపోర్టు ఆధారంగా తాము ఓటమి బాటపట్టనున్నామని అర్థమయిపోయిందని తెలిసింది. అయితే దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈసితో గొడవకు దిగారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఈసి పక్షపాంతంగా వ్యవహరిస్తుందని ఎన్నికల కార్యాలయం ముందు ధర్నాకు దిగడం, రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు నేరుగా వార్నింగ్‌లు ఇవ్వడం ఇవన్ని ఓటమిని ఒప్పుకున్నట్లు సంకేతాలేనని అంటున్నారు. దీనికి తోడు ఓట్ల లెక్కింపు విషయంలో సైతం అనుసరించాల్సిన విషయాలు, వివిప్యాట్‌ స్లిప్పుల విషయంలో సైతం కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు శనివారం ఢిల్లీ టూర్‌ పెట్టుకోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి. కేంద్ర ఎన్నికలకమీషన్‌కు ఫిర్యాదు చేస్తాం…వింటే సరేసరి లేదంటే అక్కడ ధర్నా చేస్తాం అంటూ బాబు మరోసారి సంకేతాలు ఇవ్వడంతో ఆయనకు నిజంగానే ఓటమి భయం పట్టుకుందనే ప్రచారం ఎపీలో కొనసాగుతుంది.

రిటర్న్‌ గిఫ్ట్‌ ఫలిస్తోందా…?

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారం కోల్పోనున్నాడు. జగన్‌ అధికారంలోకి వస్తాడని తెలంగాణ సీఎం కేసిఆర్‌ ముందే తెల్చేశారు. చంద్రబాబుకు తాము రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని ప్రకటించారు. రిటర్న్‌ గిఫ్ట్‌ అంటే బాబు ఓడిపోవడం, జగన్‌ అధికారంలోకి రావడమేనని ప్రస్తుతం ఆంధ్రా ప్రజలకు అర్థమయ్యిందట. బాబు అధికారం కోల్పోతే కేసిఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ విజయవంతం అయినట్లేనని ప్రజలు భావిస్తున్నారట. మొత్తానికి కేసిఆర్‌ జగన్‌కు సలహాలు, సూచనలు ఇస్తూ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ పాఠాలు చెప్పి ఆంధ్రాలో అధికారంలోకి వచ్చేలా సహకరించారని తెలంగాణ కేసిఆర్‌ సక్సెస్‌ కావడమే కాకుండా ఎపీలో జగన్‌ను సైతం తానే విజయం బాట పట్టించాడని, అనుకున్న రీతిలో జరిగితే ఇద్దరికి రెండు తెలుగు రాష్ట్రాలలో అధికసంఖ్యలో ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో సైతం టిఆర్‌ఎస్‌, వైఎస్సార్‌సీపీలు కీలకం కానున్నాయనే తెలుస్తుంది. కేంద్రంలో ఒకవేళ హంగ్‌ చాన్స్‌ ఉంటే వీరు కీలకం కావడంతోపాటు, ఇటీవల మోడ శత్రువునైనా కలుపుకుంటామని అనడంతో వీరు ఎన్డీయే వైపు మొగ్గుచూపుతారనే ప్రచారం సైతం జరుగుతోంది. మొత్తానికి ఏపీలో వైఎస్సార్‌సీపీ గెలుపు గుర్రం ఎక్కబోతుందనే భయం బాబులో కనపడుతుందని టిడిపిలో సైతం చర్చజరుగుతోందట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *