కేంద్ర రాష్ట్ర-ప్రభుత్వ విధానాలతో రైతాంగానికి తీవ్ర నష్టం

“వరి సాగు విషయంలో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్న ప్రభుత్వాలు జాబితాలో ఉన్న పంటలను పండించలేని దుస్థితి నేడు రైతు బంధు పథకం తో మిగతా పధకాలకు తూట్లు వరి పండే భూములలో వేరే పంట ఎలా వేయాలి సరైన ప్రణాళిక లేని ప్రభుత్వ విధానాలు” – రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు అవినాష్ రెడ్డి
మహబూబాబాద్, నేటిధాత్రి: పంట నష్టపరిహారం అందలేదు గ్రామాలలో రైతులు వారి వారి సమస్యలు సరైన ముందుచూపు లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల ఆరుగాలం కష్టపడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని టిపిసిసి కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అవినాష్ రెడ్డి అన్నారు. రైతాంగ సమస్యలను గ్రామ గ్రామాన తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న టువంటి రచ్చబండ కార్యక్రమం లో మహబూబాద్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో నెంబర్ వార్డు ఈదుల పూస పల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అవినాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన రైతాంగ సమస్యల మీద ఒక బలమైన టువంటి రైతు ఉద్యమాన్ని నిర్మించడం కోసం రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నుండి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నుండి రైతులను కాపాడడం కోసం రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ధరణి కార్యక్రమం వల్ల చాలామంది రైతుల భూములు నష్టపోయారని తెలిపారు. వరి సాగు విషయంలో ప్రజలను అయోమయంలోకి నెడుతున్నారు అని అన్నారు.

ఒకరు ధాన్యం పందించందని అని ఒకరు వద్దని అనడంతో రైతులు అయోమయానికి గురి అవుతున్నారని అని తెలిపారు . జాబితాలో ఉన్నటువంటి పంటలను పండించినా కూడా మద్దతు ధర కల్పించలేని దుస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. రైతుబంధు సాకుగా చూపి వ్యవసాయ పథకాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు మిల్లర్లు కలిసి రైతులు తీవ్రంగా నష్టపరుస్తున్నారన్నారు. వరి పండే పంట భూములలో వరి తప్ప వేరే పంట సాగు చేయలేని దుస్థితి ఉన్నా కూడా వరి సాగు చేయవద్దు అనడం ఏంటని ప్రశ్నించారు. రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతులకు ఇబ్బందులు కలగకుండా చేస్తుందని అన్నారు.సీనియర్ నాయకులు మురళి నాయక్ మాట్లాడుతూ మిల్లర్లు తరుగు పేరుతో రైతులను తీవ్రంగా నష్ట పరుస్తున్నారని అన్నారు. అలాగే పండించిన పంట డబ్బులు ఎకౌంట్లో పడ్డాక బ్యాంకు వారు రుణాలు ఉన్నాయని డబ్బులను కట్ చేసుకుని మిగతా డబ్బులు చెల్లిస్తున్నారని అన్నారు. దీంతో రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పంట రుణాలు వచ్చేవని కానీ ఇప్పుడు రుణమాఫీ లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే ఈ ప్రాంతంలో మిర్చి సాగు ఎక్కువగా ఉన్నందున లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టినా కూడా పంట సరిగా రాలేదన్నారు. ఒక్కొక్క రైతుకు లక్షల్లో నష్టం వాటిల్లిందని తెలిపారు. దీంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాగైనా మిర్చి సాగు చేసిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ లో రైతుల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని తెలిపారు. వెన్ను శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మిర్చి సాగు పంట ఎక్కువ సాగు చేశారని వారు లక్షల్లో నష్టపోయారన్నారు తెలిపారు. మిర్చి సాగు రైతులకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మిర్చి సాగు పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిసి అధ్యక్షులు భరత్ చంద్ర రెడ్డి , బెల్లయ్య నాయక్,పీసీసీ సభ్యులు దస్రు నాయక్, తండ వెంకటేశ్వర్లు, రజినీకాంత్, నునావత్ రాధ వెన్నం లక్ష్మారెడ్డి, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి మహేందర్ రెడ్డి, కత్తి స్వామి, రమేష్ నాయక్, రమేష్ ముఖ్య నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *