అమ్మమ్మ భూమిని రక్షించేందుకు సైకిల్‌ యాత్ర

అమ్మమ్మ భూమిని రక్షించేందుకు సైకిల్‌ యాత్ర. తన అమ్మమ్మకు ఏకైక ఆధారం ఆ భూమి. ఇప్పుడు ఆ భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. కొంతమంది కలిసి ఆ భూమిని కబ్జా చేశారు. ఎవరికి విన్నవించిన లాభం లేకుండా పోయింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఆ యువకుడికి కొట్టొచ్చినట్లు కనపడింది. ఈ సమస్య పరిష్కారం తన వల్లనో, తన అమ్మమ్మ వల్లనో కాదని గుర్తించాడు. తన బాధను హైదరాబాద్‌లో ఉన్న మాజీ మంత్రి హరీష్‌రావును కలిసి చెప్పేందుకు సైకిల్‌యాత్ర మొదలుపెట్టాడు. ములుగు జిల్లా వెంకటాపురం మండలకేంద్రంలో చామంతుల దుర్గమ్మ అనే వద్ధురాలికి చెందిన భూమిని కొంతమంది కబ్జా చేశారు. అన్యాయంగా కబ్జా చేసిన తమ భూమిని వదలాలని ఎన్నిసార్లు చెప్పిన వినిపించుకోలేదు. కబ్జాకోరుల ఆగడాలు భరించలేక తన అమ్మమ్మ పడుతున్న బాధ చూడలేక బిల్లా తరుణ్‌ అనే యువకుడు సైకిల్‌ యాత్ర చేపట్టాడు. మాజీ మంత్రి హరీష్‌రావును కలవడం తన లక్ష్యమని గురువారం వెంకటాపురం నుంచి యాత్ర చేపట్టాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *