ellu kabza chesharani atmahatyayatnam, ఇల్లు కబ్జా చేశారని ఆత్మహత్యాయత్నం

ఇల్లు కబ్జా చేశారని ఆత్మహత్యాయత్నం

వరంగల్‌ సిటి : ఇల్లు కబ్జా చేశారని కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన వరంగల్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

వరంగల్‌ కాశిబుగ్గ గ్లోబల్‌ స్కూల్‌ వద్ద తౌటం చక్రపాణి అనే వ్యక్తి అద్దెకు వచ్చి ఇంటిని కబ్జా చేసారంటూ కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఈగ బిక్షపతి, భార్య, కూతురును చుట్టుపక్కల కాలనీవాసులు అడ్డుకున్నారు. కేసును ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాదితుడు బిక్షపతి మాట్లాడుతూ అమ్మ, నాన్న సంపాందించిన ఆస్తిలో మేము ఉంటున్నామని, కూలి పని చేసుకుని జీవనం కొనసాగిస్తున్నమని, గత పదిసంవత్సరాల క్రితం తౌటం చక్రపాణి అనే వ్యక్తి మా ఇంట్లోకి అద్దెకు వచ్చాడని తెలిపారు. నాకు పిల్లలు లేరని తెలుసుకుని తౌటం చక్రపాణి, అతని భర్య ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని తీసుకువచ్చి మాకు ఇచ్చారని, కొన్ని రోజుల తరువాత మీకు అమ్మాయిని ఇచ్చామని, మాకు ఆస్తిలో వాటా ఇవ్వాలని ఎన్నో మార్లు వేదింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మాయమాటలు చెప్పి మద్యం అలవాటు చేసి సంతకాలు చేయించుకున్నారని అన్నారు. ఈ విషయంలో మాకు ఎన్నిసార్లు పోలీసులకు పిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని, కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశామని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు బాదితులను పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *