ఉమ్మడి జిల్లా కోర్ట్ ఆవరణలో పర్యావరణ దినోత్సవం

Environment Environment

ఉమ్మడి జిల్లా కోర్ట్ ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం:-

హాజరైన ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులు:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

 

గురువారం రోజున “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సైకిల్ ర్యాలీ ని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు మరియు న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్స్ బి.వి.నిర్మలా గీతాంబ, ఎ.పట్టాభి రామారావు జెండా ఊపి ప్రారంబించారు.

అనంతరం ప్రధాన న్యాయమూర్తులు, అదనపు జిల్లా న్యాయమూర్తులు నారాయణ బాబు, బి.అపర్ణాదేవి, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు యం.సాయి కుమార్, క్షమాదేశ్ పాండే మరియు ఇతర న్యాయమూర్తులు, వరంగల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సందీప్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు సైక్లిస్ట్ తేజా రెడ్డి, కె.యం.సి.ఏ.జె.టీం (వావ్ వరంగల్) జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు.

 

Environment
Environment

ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ “పర్యావరణమును పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఆరోగ్యకరమైన మరియు పచ్చని వాతావరణం మన భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది అని తెలిపారు. మొక్కలను కాపాడుకోవడంతో పాటు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకున్నప్పుడు పర్యావరణ కాలుష్యాన్ని కొంతైనా నిర్మూలించుకోగలము. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు అందరం కలిసి నడువాలని కోరారు. అలాగే, పర్యావరణ ప్రాముఖ్యత గురించి, ప్రజలకు అవగాహన పెంచాలని ప్రధాన న్యాయమూర్తులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా పాల్గొన్న, సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!